తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడిపి నలుగురు ప్రాణాలు తీశాడు. రావులపాలెం మండలం రావులపాడు వద్ద జరిగిన ఈ ఘటన పండుగపూట కొందరి జీవితాల్లో విషాదం నింపింది.
జాతీయరహదారిపై మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతుండగా అదుపుతప్పి.. డివైడర్ను ఢీకొని రహదారికి అటువైపునకు దూసుకెళ్లింది. అవతలి రోడ్డులో అటువైపుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో... అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు.