తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పండుగ పూట విషాదం... రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం... - four dead in road accident in ap

తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై రెండు కార్లు ఢీ కొన్న దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకులైన వాళ్లు మద్యం మత్తులోఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

raod accident
raod accident

By

Published : Jan 15, 2020, 4:34 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడిపి నలుగురు ప్రాణాలు తీశాడు. రావులపాలెం మండలం రావులపాడు వద్ద జరిగిన ఈ ఘటన పండుగపూట కొందరి జీవితాల్లో విషాదం నింపింది.

జాతీయరహదారిపై మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతుండగా అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొని రహదారికి అటువైపునకు దూసుకెళ్లింది. అవతలి రోడ్డులో అటువైపుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో... అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మృతులు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామస్థులుగా గుర్తించారు. ప్రమాదానికి కారకులైన వాళ్లు మద్యం మత్తులోఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు కారు దిగి పరారయ్యారు.

పండుగ పూట విషాదం... రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ఇవీ చదవండి: కాంగ్రెస్ సవాల్​ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!

ABOUT THE AUTHOR

...view details