మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎల్బీనగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ చెత్తకుండీలోని కవర్లో నాలుగు రోజుల శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
నాలుగు రోజుల శిశువు మృతదేహం... చెత్తకుండీలో లభ్యం
నాలుగు రోజుల శిశువు మృతదేహాన్ని కవర్లో చుట్టి పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శిశువు తల్లిదండ్రులే పడేశారా? లేక ఇతర వ్యక్తులెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు రోజుల శిశువు మృతదేహం... చెత్తకుండీలో లభ్యం
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువు తల్లిదండ్రులే పడేశారా? లేక ఇతర వ్యక్తులెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.