9వ తరగతి చదివే ఓ బాలికను పరిచయం చేసుకున్న నిజామాబాద్కు చెందిన శివకృష్ణ... ఆమె చిత్రాలను మార్పింగ్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడుతానంటూ.. వేధించడం మొదలు పెట్టాడు.
ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన నలుగురు అరెస్ట్ - Bhadradri District Crime News
ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని ఆ తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బు దండుకుంటున్న నలుగురు వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన నలుగురు అరెస్ట్
ఆమె నుంచి డబ్బు, బంగారం తీసుకున్నాడు. తాజాగా మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి.. వాటిని వసూలు చేసుకునేందుకు స్నేహితులతో రాగా... పోలీసులు వారిని అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసి.. వారి నుంచి ఓ కారు, బంగారు ఆభరణాలను, సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.