తెలంగాణ

telangana

మీసేవ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 5 లక్షల ఆస్తినష్టం

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని మీసేవ సెంటర్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల లోపు ఆస్తి నష్టం జరిగింది.

By

Published : Jan 3, 2021, 7:40 AM IST

Published : Jan 3, 2021, 7:40 AM IST

fire accident, mahabubabad, mee seva
అగ్ని ప్రమాదం, మహబూబాబాద్​, మీ సేవా

మహబూబాబాద్ జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని మీసేవ కేంద్రంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్​సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మీ సేవాలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు.. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

ఈ ప్రమాదంలో 3 ల్యాప్​టాప్​లు, జిరాక్స్ మిషన్, 4 ప్రింటర్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని మీసేవ నిర్వాహకుడు తెలిపాడు. కేంద్రం మూసివేసి ఇంటికి వెళ్లిన గంట లోపే ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:ఆన్‌లైన్​ రుణ యాప్‌ల వేధింపులకు మరో ప్రాణం బలి

ABOUT THE AUTHOR

...view details