సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బీడీఎల్ భానూర్ గ్రామ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
ఏపీజీవీబీ బ్యాంకులో అగ్ని ప్రమాదం - సంగారెడ్డి జిల్లా వార్తలు
ఏపీజీవీబీ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూర్ గ్రామంలో జరిగింది. మంటల్లో బ్యాంకులోని సామగ్రి కాలిపోయింది.

ఏపీజీవీబీ బ్యాంకులో అగ్ని ప్రమాదం
ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో బ్యాంకులోని సామగ్రి కాలిపోయింది.
ఇదీ చదవండి:కొవాగ్జిన్ షిప్పింగ్ను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి: సుచిత్ర ఎల్లా