తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2020, 12:08 PM IST

ETV Bharat / jagte-raho

జిన్నారం మండలంలో కారు, బైక్ ఢీ... చెలరేగిన మంటలు

సంగారెడ్డి జిల్లా కిష్టయ్యపల్లి శివారులో కారు, బైకును ఢీకొని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఓ ప్రైవేటు పరిశ్రమకు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

fire accident at jinnaram in sangareddy district
జిన్నారం మండలంలో కారు, బైక్ ఢీ... చెలరేగిన మంటలు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టయ్య పల్లి శివారులో కారు, బైక్ ఢీకొని మంటలు చెలరేగాయి. ఓ పరిశ్రమలో పనిచేసే కిషోర్ అనే వ్యక్తి కారులో వెళ్తూ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దాచారం గ్రామానికి చెందిన బాబుల్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ ప్రైవేటు పరిశ్రమకు చెందిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి... మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయమని స్థానికులు తెలిపారు.

జిన్నారం మండలంలో కారు, బైక్ ఢీ... చెలరేగిన మంటలు

ఇదీ చదవండి:మోత్కూర్ సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details