రంగారెడ్డి జిల్లా మన్నేగూడలోని జాతీయ కోరమండల్ లిమిటెడ్ క్రిమిసంహారక మందుల గోడౌన్లో గత కొద్ది రోజులుగా మందులు చోరీకి గురవుతున్నాయి. ఈ విషయమై కంపెనీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గోడౌన్లో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులే దొంగలుగా తేల్చారు.
పని చేస్తున్న కంపెనీకే కన్నం వేసిన ఘనులు - హైదరాబాద్ తాజా వార్తలు
పని చేస్తున్న కంపెనీకే కన్నం వేశారు ముగ్గురు ఉద్యోగులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి రూ.1,07,92,000 విలువైన వాహనాలు, చరవాణిలు, క్రిమిసంహారక మందులు స్వాధీనం చేసుకున్నారు.
పని చేస్తున్న కంపెనీకే కన్నం వేసిన ఘనులు
నిందితులు నకిలీ తాళపు చెవిని తయారు చేయించి రెండు నెలలో వ్యవధిలో ఐదు సార్లు 98 కాటన్ల క్రిసంహారక మందు బాక్సులను దొంగిలించారు. వీరి పట్టుకున్న పోలీసులు.. రూ.1,07,92,000 విలువైన రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు, 98 కాటన్ల క్రిమిసంహాక మందులు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
ఇదీ చదవండి:స్వల్పంగా పెరిగిన బంగారం ధర