తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం

అధికారుల నిర్లక్ష్యం రైతన్న ప్రాణాలను తీసింది. కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి గ్రామానికి చెందిన భూమయ్య  విరాసత్​ చేయాలని సంవత్సరం నుంచి కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఆ మనస్థాపంతోనే రైతు మృతి చెందాడు.

By

Published : Apr 3, 2019, 12:14 AM IST

అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం

అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యం అన్నదాత ప్రాణాలను తీసింది. తండ్రి పేరు మీద ఉన్న ఎకరంన్నర భూమిని తనకు విరాసత్​ చేయాలని సంవత్సరం నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగాడు భూమయ్య. రోజులు గడుస్తున్నా పని జరగలేదు. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా భూమయ్యను వెంటాడాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే రైతుబంధు అందలేదని మనస్థాపం అతని మరణానికి కారణమైంది. విధుల్లో అలసత్వం వహించిన విఆర్ఓ, ఆర్ఐ పై చర్యలు తీసుకొని రైతు కుటుంబానికి పరిహారం వర్తింపచేయాలని, ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు గ్రామస్తులు. భూమయ్య మృతదేహంతో చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details