మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారంకు చెందిన మల్లయ్య(50)కు తన వ్యవసాయ పొలంలో కరెంట్షాక్ కొట్టి మృతి చెందాడు. పొలానికి భార్య భాగ్యమ్మతో కలిసి వెళ్లాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ తరుణంలో రైతు అక్కడికక్కడే పొలంలో పడి మరణించాడు.
పొలంలో రైతు మృతి.. విలపిస్తున్న కుటుంబ సభ్యులు - chetla gouraram medak district latest news
ఓ రైతు పొలంలో వ్యవసాయం పనుల కోసం వెళ్లాడు. వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పొలంలో రైతు మృతి.. విలపిస్తున్న కుటుంబ సభ్యులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఎన్ని సార్లు చెప్పినా అధికారులు స్తంభాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :వర్షాలతో భారీ గుంతలు... పట్టించుకోని అధికారులు