తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - రైతు ఆత్మహత్య లేటెస్ట్​ వార్తలు

నమ్ముకొని సాగు చేసిన పత్తి నట్టేట ముంచటంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

farmer
farmer

By

Published : Nov 8, 2020, 9:01 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని ఇసరం పల్లి గ్రామానికి చెందిన చిన్న మల్ల బాలరాజు(38) తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని.. పత్తి సాగు చేశాడు. భారీ వర్షాలకు పంట దెబ్బతింది. ఆశించిన దిగుబడి రాలేదని, సాగుకు చేసిన అప్పులు తీరే పరిస్థితి లేదని మనస్తాపం చెందాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు దేవరకద్ర ఎస్సై భగవంత రెడ్డి తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:చిన్నారిపై 'వేధింపులు'.. ఆటోడ్రైవర్​ను చితక్కొట్టిన మహిళలు

ABOUT THE AUTHOR

...view details