అకాల వర్షంతో పంట నష్టం.. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడం.. మరోవైపు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటం, పెళ్లి కావాల్సిన కూతురు ఉండటం.. ఇన్ని సమస్యలతో సతమతమైన ఓ రైతు... తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనిని గమనించిన బంధుమిత్రులు అతనిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 26న రాత్రి కన్నుమూశారు.
సమస్యలతో సతమతం.. తీవ్రమనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య - Farmer Suicide Latest News
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ రైతు అకాల వర్షంతో పంట నష్టం.. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమస్యలతో సతమతం.. తీవ్రమనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య
మృతుడు శ్రీనివాస్ (55)కు 3 ఎకరాల పొలం ఉంది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తెను బంధువులకు దత్తత ఇచ్చాడు. ఇద్దరు అమ్మాయిల వివాహానికి 5 లక్షల వరకు అప్పు చేశాడు. పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బతినడంతో అప్పు తీరే మార్గం కనిపించకపోవడం.... మరో కుమార్తె వివాహం చేయలేమనే నిర్ణయానికి వచ్చి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.