తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2020, 10:04 PM IST

ETV Bharat / jagte-raho

ఆశ కల్పించి.. అందినంత దోచేశాడు

భాగ్యనగరంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే...మరోవైపు సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆశ చూపించి అందినంత దోచేసుకుంటున్నారు.

Hyderabad cyber crime latest news
Hyderabad cyber crime latest news

ద్విచక్ర వాహనం అమ్ముతానంటూ ఓ సైబర్​ నేరగాడు ఫేస్​బుక్​లో ప్రకటనిచ్చాడు. సికింద్రాబాద్​కు చెందిన విజయత్ర మోహన్ ఆ ప్రకటన చూసి... అందులోని ఫోన్ నంబర్​ను సంప్రదించాడు. ఆవతలి వ్యక్తి తన పేరు మనీష్ సింగ్ అని బదులిచ్చాడు.

బండినచ్చితే ట్రాన్స్​పోర్ట్ కోసం 2500 రూపాయలు ఇవ్వాలన్నాడు. మోహన్ వెంటనే ఆ డబ్బును పంపించాడు. అలా ఒక లక్ష 16వేల రూపాయలు ఇచ్చాడు. చివరకు మోసం గ్రహించి బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details