తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా హెడ్రీ పీఎస్ పరిధిలోని ఎలదుడమి అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్కు చెందిన కొట్టె అభిలాష్ అలియాస్ చందు అలియాస్ సోమ అనే పెరమిళి దళ కమాండర్ మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ శైలేష్ బాల్కావుడే శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎన్కౌంటర్.. ములుగు జిల్లాకు చెందిన దళ కమాండర్ మృతి - దళ కమాండర్ అభిలాష్ మృతి వార్తలు
మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ములుగు జిల్లా వాసి మృతి చెందాడు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కొట్టె అభిలాష్ అనే దళ కమాండర్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
![ఎన్కౌంటర్.. ములుగు జిల్లాకు చెందిన దళ కమాండర్ మృతి encounter in maharastra a dala kamander dead belonging to mulugu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7898207-977-7898207-1593919634041.jpg)
ఎన్కౌంటర్.. ములుగు జిల్లాకు చెందిన దళ కమాండర్ మృతి
మావోయిస్టులు, పోలీసు బలగాల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతను మృతి చెందాడని ఎస్పీ పేర్కొన్నారు. ఎన్కౌంటర్ స్థలంలో ఓ తుపాకీ, వాకీటాకీలు, ప్రెషర్కుక్కర్లు, 20 కిట్ బ్యాగులు, సామగ్రి, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతనిపై రూ.8 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.
ఇదీచూడండి: డేంజరస్: కాలకుండానే వదిలేస్తున్నారు... ప్రజలు వణికిపోతున్నారు!