తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యార్థులే లక్ష్యంగా భారీ మోసం

మీరు ఒకరికి సాయం చేయండి. ఆ ఒక్కరికి మరో ముగ్గురికి సాయం చేయమనండి. ఇది స్టాలిన్​ సినిమాలో మంచి కోసం చేసిన ఒ ప్రయత్నం. ఇప్పుడు అచ్చం ఇలాంటి ప్రయత్నమే ఒ సంస్థ చేసింది. మంచి కోసం కాదు... మోసం చేయడానికి. గొలుసు కట్టు విధానంలో విద్యార్థులే లక్ష్యంగా రూ.వెయ్యి కోట్లు మోసానికి పాల్పడింది ఓ కుటుంబం.

By

Published : Mar 12, 2019, 5:46 PM IST

Updated : Mar 12, 2019, 8:03 PM IST

ఈబిజ్ పేరుతో జరుగుతున్న మోసాల డొంకతా కదిలింది.

ఈబిజ్ పేరుతో జరుగుతున్న మోసాల డొంకతా కదిలింది.
మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. విద్యార్థులే లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తూ రూ.వెయ్యి కోట్ల మేర వసూలు చేసిన నేరస్థుడిని చాకచక్యంగా అరెస్టు చేశారు. మాదాపూర్​ పీఎస్​లో ఓ బాధితుడు చేసిన ఫిర్యాదుతో ఈబిజ్ పేరుతో జరుగుతున్న మోసాల డొంకతా కదిలింది.

నిర్వాహకుడు హితిక్​ మల్హాన్​నుఅరెస్టు తరువాత అతని ఖాతాల్లోని రూ.70 లక్షలు స్తంభింపజేసినట్లు తెలిపారు. గతంలో ఆదిలాబాద్‌, వరంగల్‌లోనూ వీరిపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. ఇలాంటి సంస్థల స్కీమ్‌లకు ప్రజలు మోసపోవద్దని కూడా​ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత

Last Updated : Mar 12, 2019, 8:03 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details