కూకట్పల్లి మూసాపేట్ సర్దార్నగర్లో దుర్గామాత ఆలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుడిలోని విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు. సమీపంలోని జంట నాగుల విగ్రహాన్నీ ముక్కలు చేశారు. ఆపై ఓ శునకాన్ని చంపి.. ఆలయ ఆవరణలో వేలాడదీశారు.
విషయం తెలుసుకున్న మూసాపేట్ భాజపా కార్పొరేటర్ మహేందర్ ఆలయం ఎదుట బైఠాయించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.