లాక్ డౌన్ కారణంగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్లకు తక్షణం గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలి బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం చేపట్టిన రహదారి దిగ్బంధాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
జోగులాంబ గద్వాల పట్టణంలోని డీకే అరుణ నివాసం నుంచి ర్యాలీగా వస్తున్న బీజేవైఎం నాయకులను గద్వాల టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టగా.. ఆందోళనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు బీజేవైఎం నాయకులు నిరసన చేపట్టారు.