తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో ఘర్షణ.. అన్నను చంపిన తమ్ముడు - మేడ్చల్​ జిల్లా నేర వార్తలు

మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ములు ఘర్షణకు దిగారు. కోపోద్రిక్తుడైన తమ్ముడు అన్నను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Conflict over alcohol .. younger brother who killed Anna
మద్యం మత్తులో ఘర్షణ.. అన్నను చంపిన తమ్ముడు

By

Published : Sep 19, 2020, 8:05 PM IST

Updated : Sep 19, 2020, 9:24 PM IST

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్​స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్​లో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో హనుమాన్​సింగ్​ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

తాగుడికి బానిసలుగా మారిన హనుమాన్​ సింగ్​, నర్సింగ్​ సింగ్​ అనే అన్నదమ్ములు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన తమ్ముడు నర్సింగ్​ సింగ్​ అన్న హనుమాన్​ సింగ్​పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన హనుమాన్​సింగ్​ అక్కడే కుప్పకూలిపోయాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు నర్సింగ్​ సింగ్​ను అదుపులోకి తీసుకున్నారు. రక్త స్రావంలో పడి ఉన్న హనుమాన్​సింగ్​ను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.. బయటకు వెళ్లిన తల్లీకొడుకులు... చెరువులో విగతజీవులు

Last Updated : Sep 19, 2020, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details