హన్మకొండలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిబ్బందిపై 42వ డివిజన్ కాలనీవాసులు చేయి చేసుకున్నారు. రోడ్డుపై అక్రమంగా కట్టిన గోడలు కూల్చి వేస్తుండగా అడ్డుకుని దాడి చేశారు.
ట్విట్టర్ ద్వారా..
డివిజన్ ప్రాంతం గొల్లపల్లి యాదవనగర్లో సుగుణమ్మ, నిలవేణి, రాజేశ్వరీ, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సీసీ రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మించారు. ఆ విషయాన్ని కార్పొరేషన్ కమిషనర్ పమేల సత్పతికి ట్విట్టర్ ద్వారా కొందరు ఫిర్యాదు చేశారు. వెంటనే అది కూల్చి వేయాలని అదేశించడంతో సిబ్బంది, పోలీసులతో కలిసి అధికారులు అక్కడికి వెళ్లారు.