తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'నెలరోజులు గడుస్తున్నా... కేసులో పురోగతి లేదు' - kkr chit fund company fraud

నెల రోజుల కింద బయటపడిన కేకేఆర్​ చిట్​ఫండ్​ కంపెనీ మోసం ఘటనలో ఎలాంటి పురోగతి లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. తమ డబ్బుతో కంపెనీ డైరెక్టర్లు ఆస్తులు కొని పరారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల్లో కేసులు ఛేదించే పోలీసులు.. తమ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.

chit fund victims protest at prashanth nagar
chit fund victims protest at prashanth nagar

By

Published : Dec 22, 2020, 3:25 PM IST

'నెల రోజులు గడుస్తోన్నా... కేసులో పురోగతి లేదు'

హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రశాంత్​నగర్​లోని కేకేఆర్ చిట్ ఫండ్ కంపెనీ బాధితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసి నెల రోజులు పూర్తవుతున్నా... కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ బాధితులు నిరసనకు దిగారు. కంపెనీకి చెందిన ఒక డైరెక్టర్ వెంకటరమణారావు సోమవారం వరకు అందుబాటులో ఉన్నా... పోలీసులు అదుపులోకి తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు అతను కూడా పారారయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టెక్నాలజీని ఉపయోగించి గంటల వ్యవధిలోనే కేసులు ఛేదిస్తోన్న పోలీసులు... తమ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఖాతాదారుల డబ్బులతో చిట్​ఫండ్ కంపెనీ డైరెక్టర్లు ఆస్తులను కొనుగోలు చేసి తమను నిండా ముంచారన్నారు. వారి ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: రుణ యాప్​లపై దర్యాప్తు ముమ్మరం... అదుపులో నలుగురు

ABOUT THE AUTHOR

...view details