సూర్యాపేట జిల్లాలో కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ఓ మహిళకు నిమ్ము ఉంటే.. కరోనా అని మోసగించి ఆరువేల రూపాయలను తీసుకున్నారు. హుజూర్నగర్లో రోజురోజుకు కరోనా కేసులు నమోదు కావడం వల్ల ఆర్ఎంపీలు, ప్రైవేటు ల్యాబ్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడిపై, ఓ ల్యాబ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరోనా పేరుతో మోసం... అందిన కాడికి దోచుకుంటున్న ఆర్ఎంపీలు
5రోజులుగా నిమ్ముతో ఉన్న మహిళకు కరోనా పాజిటివ్ అంటూ.. మోసగించి ఆరువేల రూపాయలను తీసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో చోటుచేసుకుంది.
Cheating in the name of Corona in suryapet district