నిజామాబాద్ జిల్లాలో కారు దొంగతనం జరిగింది. దొంగలు కారులో వచ్చి మరో కారును దొంగిలించారు. డిచ్పల్లిలో మండల కేంద్రంలో బండి జ్ఞానేశ్వర్ తన కారును ఇంటిముందు పార్కింగ్ చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో కారును తీసుకెళ్లారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారులో వచ్చి మరో కారును ఎత్తుకెళ్లారు.. - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లాలో దొంగలు కారులో వచ్చి మరో కారును ఎత్తుకెళ్లారు. మూడున్నర నిమిషాల్లోనే తీసుకెళ్లారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారులో వచ్చి మరో కారును ఎత్తుకెళ్లారు!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారును చోరీ చేస్తుండగా నమోదైన సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి:లారీ టైరు పగిలి... 120 పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి