తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పీవీ ఎక్స్​ప్రెస్​ హైవేపై కారు బోల్తా.. ఒకరికి గాయాలు - రాజేంద్రనగర్ పీవీ ఎక్స్​ప్రెస్​పై ప్రమాదం వార్తలు

అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Car roll over on Pv Express Highway .. One person injured
పీవీ ఎక్స్​ప్రెస్​ హైవేపై కారు బోల్తా.. ఒకరికి గాయాలు

By

Published : Jul 10, 2020, 2:30 PM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీ ఎక్స్​ప్రెస్ పిల్లర్​ నెంబర్​ 170 వద్ద​ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్​ విమానాశ్రయానికి వెళ్తుండగా కారు బోల్తా పడింది. ప్రమాదంలో హర్ష అగర్వాల్​ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

క్రేన్​ సహాయంతో కారును పక్కకు తొలగించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతనెల ఇదే ఫ్లైఓవర్​పై అతివేగంతో వెళ్తున్న కారుకు ట్రాఫిక్​ పోలీసులు జరిమానా వేయడం గమనార్హం.

ఇదీచూడండి: ఈ పెళ్లి నాకొద్దు.. అధికారుల్ని ఆశ్రయించిన బాలిక

ABOUT THE AUTHOR

...view details