తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారుతో సహా వ్యక్తి సజీవదహనం... ప్రమాదమా.. హత్యా?

ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లా మల్లెల ఘాట్​ వద్ద కారుతో సహా ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు కార్​ మెకానిక్​గా పనిచేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

By

Published : Dec 30, 2020, 9:57 AM IST

car
car

ఏపీ కడప జిల్లా తొండూరు మండలం మల్లెల ఘాట్​ సమీపంలో మంగళవారం రాత్రి కారుతో సహా ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మృతుడు ప్రొద్దుటూరుకి చెందిన షేక్​ నూర్​ మహమ్మద్​గా గుర్తించారు. కారు మెకానిక్​గా పని చేసిన నూర్ మహమ్మద్... పులివెందులలో ఒక వాహనం మరమ్మతుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అనుమానాస్పద మృతిగా.. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎన్నో అనుమానాలు

ప్రొద్దుటూరు - పులివెందుల మధ్య 66 కిలోమీటర్ల దూరం ఉండగా.. మహమ్మద్ అర్థరాత్రి వేళ బయలుదేరాల్సిన అవసరం లేదు. కారులోనే వ్యక్తి బూడిదయ్యేలా మంటలు వచ్చాయంటే.. కనీసం రెండు గంటలు పాటు కారు అగ్నికి ఆహుతి అయ్యి ఉండాలి. ఈ మార్గంలో నిత్యం లారీలు, బస్సులు రాకపోకలు ఉంటాయి. ఆ సమయంలో కారు కాలిపోవటం ఎవరూ చూడకపోవటం విచిత్రంగా ఉంది. కారులో ఉష్ణోగ్రత పెరిగితే.. హీటర్ సిగ్నల్ డ్రైవర్​కు తెలుస్తుంది.. కానీ కారు దగ్ధమయ్యేంత ఉష్ణోగ్రత వచ్చినా, నూర్ మహమ్మద్​కు తెలియలేదా.. అసలేం జరిగింది.. అన్నది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details