తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి - రోడ్డు ప్రమాదం వార్తలు

విషాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
విషాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

By

Published : Dec 10, 2020, 6:25 AM IST

Updated : Dec 10, 2020, 7:05 AM IST

06:23 December 10

విషాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

విషాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు ఫ్లైఓవర్‌పై ఘోరప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా,  ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మాచర్ల శ్యామ్(60), మాచర్ల శారద(55), మాచర్ల శ్యామల(38) మృతి చెందారు. భాగ్యలక్ష్మి, నవీన్, మాన్యశ్రీ(7), గోపి(8), అక్షయ్, డ్రైవర్ సైదులు గాయపడ్డారు. మృతులు ఖమ్మం జిల్లా మధిరలోని ఆత్కూరు వాసులుగా గుర్తించారు.  

ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో డ్రైవర్ సహా ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. వేములవాడకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులు, క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

ఇదీ చదవండి:ఆర్థిక ఇబ్బందులతో తల్లీ, ఇద్దరు కుమార్తెలు బలవన్మరణం

Last Updated : Dec 10, 2020, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details