తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యాచకురాలి నుంచి రూ.4 వేలు తీసుకున్న క్యాబ్ డ్రైవర్ హత్య - Vishakha dwaraka bus station complex

యాచకురాలి నుంచి రూ.4 వేలు తీసుకున్న క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఏపీ విశాఖలో ద్వారకా బస్​స్టేషన్​లో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ap crime news
యాచకురాలి నుంచి రూ.4 వేలు తీసుకున్న క్యాబ్ డ్రైవర్ హత్య

By

Published : Oct 28, 2020, 10:06 AM IST

ఏపీ విశాఖలో ద్వారకా బస్​స్టేషన్​లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన గూడాల అప్పల నాయుడు క్యాబ్ డ్రైవర్​గా పని చేసేవాడు. ఆర్టీసీ కాంప్లెక్స్​లో భిక్షాటన చేసే కొందరితో అప్పల నాయుడికి చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యాచకుల్లో ఓ మహిళ నుంచి అప్పుడప్పుడు అప్పలనాయుడు డబ్బు తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే బిక్షాటన చేసే అనురాధ నుంచి రూ. 4 వేలు తీసుకున్నాడు.

తోటి యాచకులకు చెప్పడం వల్లే..

సదరు విషయాన్ని అనురాధ తోటి యాచకులకు చెప్పింది. అప్పలనాయుడు.. కాంప్లెక్స్​లోని ఓ ఫుట్​పాత్​పై సోమవారం రాత్రి నిద్రిస్తున్నాడనే సమాచారంతో అనురాధతో పాటు దాసు, అబ్బులు, వెంకటరెడ్డి అక్కడికి వెళ్లారు. అనురాధ నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్​ చేశారు. అప్పల నాయుడు నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల ఆవేశంతో సిమెంట్ ఇటుకతో అప్పల నాయుడు తలపై బలంగా కొట్టారు. అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

కేజీహెచ్​కు తరలింపు..

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని కేజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పలనాయుడు ప్రాణాలు కోల్పోయాడు. తీసుకున్న డబ్బు ఇవ్వనందుకు తామే హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:పంట దక్కక.. అప్పు తీర్చలేక.. యువ రైతులు బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details