సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై చిరాగ్పల్లి నుంచి గడ్డి నింపుకుని జహీరాబాద్ వైపు వస్తున్న లారీ క్యాబీన్లో మంటలు చెలరేగాయి.
గడ్డి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం - Burning lorry On the outskirts of Satwar
గడ్డి లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
![గడ్డి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం Burning lorry going with a load of grass On the outskirts of Satwar in Sangareddy District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9635220-877-9635220-1606123728302.jpg)
గడ్డి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం
అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డుపై నిలిపివేశాడు. లారీ క్యాబిన్లోని వస్తువులను కిందికి దింపుకునిలోగా మంటలు ఎగసిపడ్డాయి. ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అదుపు చేయడం వల్ల లారీ పూర్తిగా దగ్ధం కాకుండా మిగిలిపోయింది. ఘటనాస్థలానికి చిరాగ్పల్లి ఎస్ఐ గణేశ్ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.