ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి వద్ద బొలెరో వాహనం బోల్తా పడి 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సుంగుగూడ గ్రామానికి చెందిన 20మంది బోథ్ మండలం కైలాశ్ టేకిడిలోని శివాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన జరిగింది.
బొలెరో వాహనం బోల్తా.. 12మందికి తీవ్ర గాయాలు - ఆదిలాబాద్ జిల్లా తాజా వార్తలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో బొలెరో వాహనం బోల్తా పడి 12మందికి తీవ్ర గాయాలయ్యాయి. కైలాశ్ టేకిడిలోని శివాలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా మహరాష్ట్రలోని సుంగుగూడ గ్రామస్థులుగా గుర్తించారు.
![బొలెరో వాహనం బోల్తా.. 12మందికి తీవ్ర గాయాలు ACCIDNET](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10377200-458-10377200-1611587396736.jpg)
ACCIDNET
క్షతగాత్రులకు బోథ్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బొలెరో వాహనం టైరు ఊడి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'నాగార్జున సాగర్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం'