తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దారుణం: చెరువులో ఆడశిశువు మృతదేహం - అమానవీయ ఘటన

అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన శిశువు... చెరువులో విగతజీవిగా తేలింది. ముక్కుపచ్చలారని ఆ పసికందు దేహం... నీటిలోని ప్రాణులకు ఆహారమైంది. ఈ అమానవీయ ఘటన మెదక్​లో వెలుగుచూసింది.

baby girl dead body
baby girl dead body

By

Published : Sep 25, 2020, 10:40 AM IST

మెదక్​లో దారుణ ఘటన వెలుగు చూసింది. పట్టణంలోని నాయకొని చెరువులో ఓ ముక్కుపచ్చలారని ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. చెరువు దగ్గర నివాసమున్న ఓ వ్యక్తి అటుగా వెళ్తూ.... నీళ్లలో తేలిన పసికందు మృతదేహాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి... శిశువు చనిపోతే నీటిలో వేశారా...? చంపేసి వేశారా...? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

ABOUT THE AUTHOR

...view details