తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బయపడి పారిపోయారు... పోలీసులకు దొరికిపోయారు

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఈ నెల 8న ఆటోను దొంగలించిన దుండగులు దొరికిపోయారు. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలను భయపడ్డ దుండగులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంబడించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

By

Published : Aug 27, 2020, 10:45 AM IST

auto thives arrested in jinnaram
auto thives arrested in jinnaram

ఆటో దొంగలించిన ఇద్దరు దొంగలను సంగారెడ్డి జిల్లా జిన్నారం పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలోని దర్గా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా... ఇద్దరు వ్యక్తులు ఆటో, మోటార్ సైకిల్​పై వచ్చారు. పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు.

నిందితులు దుండిగల్ తండాకు చెందిన రాకేశ్​, ఎల్లారెడ్డిగూడెం తండాకు చెందిన సికిందర్​గా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని విచారించగా... తాటి నవీన్​కు చెందిన ఆటోను ఈ నెల 8వ తేదీ రాత్రి దొంగలించినట్లు ఒప్పుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిందితులను రిమాండుకు తరలించారు.

ఇదీ చూడండి:'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details