మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పీఎస్ పరిధిలోని బాలాజీ నగర్లో శ్రీలక్ష్మీ నరసింహ దేవాలయంలో ఒడుసు నర్సింహ అనే దొంగ దేవాలయంలోకి చొరబడి దొంగతనం చేస్తుండగా ఆలయకమిటీ సభ్యులు పట్టుకున్నారు. హుండీలో ఉన్న నలబై వేల రూపాయలు, ఆలయంలో ఉన్న స్వామివారి నగలను అపహరిస్తుండగా దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
దొంగను చితకబాదిన ఆలయ కమిటీ సభ్యులు - thief attempted robbery at temple
ఆలయంలో చోరీకి యత్నించిన దొంగను పట్టుకుని ఆలయ కమిటీ సభ్యులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

దొంగను చితకబాదిన ఆలయ కమిటీ సభ్యులు
ఇదే దేవాలయంలో నర్సింహ చోరీకి పాల్పడడం ఇది రెండోసారని ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా నేరారోపణలు ఉన్నాయని అన్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం