కేటీఆర్ పీఏనంటూ డబ్బు డిమాండ్... అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ - కేటీఆర్ పీఏ వార్తలు
19:51 November 16
కేటీఆర్ పీఏనంటూ డబ్బు డిమాండ్... అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్
ఏపీ మాజీ రంజీ ఆటగాడు నాగరాజును ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ పీఏనంటూ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేటీఆర్ పీఏ తిరుపతి రెడ్డి పేరుతో ఫార్మా కంపెనీలకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 7న ఓ ఫార్మా కంపెనీ మేనేజ్మెంట్కు ఫోన్ చేసిన నాగరాజు... రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు.
కాలుష్య నియంత్రణ మండలి నుంచి నోటీసులు రాకుండా చూస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు గతంలో 7 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నాగజారును టాస్క్ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి :కాంగ్రెస్, భాజపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: హరీశ్