ములుగు జిల్లా వెంకటాపురం మండలం బొదాపురం వద్ద ఏడు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. పొలంలో ఉన్న వాటికి విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతమై అవి మరణించాయి. తమకు జీవనాధారమైన జీవాలు మృతి చెందగా... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో తూతూమంత్రంగా వ్యవహరించకుండా రైతులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించాలని స్థానికులు కోరారు.
విద్యుదాఘాతంలో ఏడు మూగజీవాలు మృతి - animals death due to current shock in mulugu district
విద్యుదాఘాతంలో ఏడు మూగజీవాలు మరణించిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం వద్ద జరిగింది. విద్యుత్ తీగలు తెగడం వల్ల ప్రమాదం జరిగిందని.. ప్రభుత్వం ఈ విషయమై స్పందించి తమకు పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరారు.
విద్యుదాఘాతంలో ఏడు మూగజీవాలు మృతి