సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పాండవుల చెరువులో ప్రమాదవశాత్తు పడి లక్ష్మి అనే మహిళ మృతి చెందింది.
పట్టణంలోని 9వ వార్డుకు చెందిన బాకి లక్ష్మి అనే మహిళకు మతి స్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కాసేపటికి మేలుకువ వచ్చిన కుటుంబ సభ్యులు లక్ష్మి కోసం అర్ధరాత్రి వరకు వెతికారు. ఎక్కడా కనిపించకపోవడం వల్ల తిరిగి ఇంటికి వెళ్లారు.