తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2020, 9:28 PM IST

ETV Bharat / jagte-raho

జంపన్న వాగులో యువకుడు గల్లంతు

జంపన్న వాగులో స్నానానికి దిగిన యువకుడు గల్లంతయ్యాడు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం వచ్చిన... హైదరాబాద్​ గాయత్రి నగర్​కు చెందిన భాను.. వాగులో స్నానానికి దిగి నీట మునిగాడు.

జంపన్న వాగులో యువకుడు గల్లంతు
జంపన్న వాగులో యువకుడు గల్లంతు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్న వాగులో యువకుడు గల్లంతయ్యాడు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన యువకుడు స్నానం కోసం వాగులో దిగి నీట మునిగాడు.

హైదరాబాద్​లోని గాయత్రి నగర్​కు చెందిన భానుకు పదిరోజుల కిందట వివాహమైంది. కుటుంబంతో సహా సమ్మక్క సారలమ్మల దర్శనానికి వచ్చాడు. స్నానం చేద్దామని జంపన్నవాగులో దిగాడు. వాగులోని చెక్​డ్యాం వద్ద నీట మునిగి గల్లంతయ్యాడు. యువకుడి కోసం కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details