.
చిచ్చు పెట్టిన అమ్మ ఒడి డబ్బులు... భార్య ఆత్మహత్య - చిత్తూరు జిల్లాలో మహిళ మృతి
అమ్మ ఒడి డబ్బులు కోసం భర్తతో గొడవపడి ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా నేతి గుండ్లపల్లిలో జరిగింది. మహేశ్, ఆదిలక్ష్మిలకు నలుగురు పిల్లలు. వీరిలో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15,000 వచ్చింది. ఈ డబ్బును అప్పులకు జమ చేద్దామని భార్య తెలుపగా.. పిల్లలకు నగలు చేద్దామని భర్త చెప్పాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆదిలక్ష్మి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి సోదరుడు మాత్రం భర్త వేధింపుల వల్ల తన అక్క చనిపోయిందని అంటున్నాడు.
dead