తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సైకిల్​ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనదారుడు మృతి

సైకిల్​ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో సైకిల్​ నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలవ్వడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

By

Published : Jan 24, 2021, 10:59 PM IST

Updated : Jan 25, 2021, 6:19 AM IST

a-motorcyclist-was-killed-when-he-hit-a-bicycle-in-peddapally-district
సైకిల్​ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనదారుడు మృతి

వేగంగా వెళ్తోన్న ద్విచక్రవాహనం అదుపు తప్పి అదే మార్గంలో వస్తున్న ఓ సైకిల్​ను ఢీ కొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ద్విచక్రవాహనదారుడు పండుగ రాహుల్​ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కూచిరాజ్ పల్లి గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి రోజువారీ కూలీ పని పూర్తి చేసుకుని సైకిల్​పై ఇంటికి బయలుదేరాడు. అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న రాహుల్ అదుపు తప్పి సైకిల్​ను ఢీ కొట్టి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైన రాహుల్​ను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సైకిల్​ నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలవ్వడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:పిల్లలకు వీడియో కాల్​ చేసి తండ్రి ఆత్మహత్య

Last Updated : Jan 25, 2021, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details