వేగంగా వెళ్తోన్న ద్విచక్రవాహనం అదుపు తప్పి అదే మార్గంలో వస్తున్న ఓ సైకిల్ను ఢీ కొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ద్విచక్రవాహనదారుడు పండుగ రాహుల్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సైకిల్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనదారుడు మృతి
సైకిల్ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో సైకిల్ నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలవ్వడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కూచిరాజ్ పల్లి గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి రోజువారీ కూలీ పని పూర్తి చేసుకుని సైకిల్పై ఇంటికి బయలుదేరాడు. అదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న రాహుల్ అదుపు తప్పి సైకిల్ను ఢీ కొట్టి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైన రాహుల్ను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సైకిల్ నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలవ్వడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి:పిల్లలకు వీడియో కాల్ చేసి తండ్రి ఆత్మహత్య