తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మినీ బస్సును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా మురహరిపల్లి చౌరస్తా వద్ద మినీ బస్సును ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Dec 28, 2020, 4:51 PM IST

మినీ బస్సును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి
మినీ బస్సును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి

మినీ బస్సును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా మురహరిపల్లి చౌరస్తా వద్ద మినీ బస్సును ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేటకు చెందిన హరీశ్​.. జీడిమెట్ల సూరారం మల్లారెడ్డి ఆసుపత్రిలో ఉన్న బంధువులను చూడడానికి వెళ్తున్నాడు.

మురహరిపల్లి వద్ద మినీ బస్సు మలుపు తిరుగుతుండగా... గమనించని హరీశ్​ దాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details