సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత అదృశ్యం కేసు నమోదు అయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె బయటకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కర్ణాటకకు చెందిన నిఖితకు బాలాసాహెబ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. బోయిన్పల్లిలోని భావనకాలనీలో నివాసం ఉంటున్నారు. కర్ణాటకకు వెళ్తానని ఆదివారం సాయంత్రం ఇంట్లో చెప్పినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
బోయిన్పల్లిలో ఓ వివాహిత అదృశ్యం - secunderabad crime news
వివాహిత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భావనకాలనీలో నివాసం ఉంటున్న నిఖిత అనే మహిళ ఆదివారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు బోయిన్ పల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు.
![బోయిన్పల్లిలో ఓ వివాహిత అదృశ్యం a married woman disappears in Bowenpally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9407503-875-9407503-1604337002560.jpg)
బోయిన్పల్లిలో ఓ వివాహిత అదృశ్యం
స్నేహితులు, బంధువులు, తెలిసినవారి ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. వెంటనే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిఖిత ఇంటి నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
ఇదీ చూడండి: సైబర్ నిందితున్ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు