ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో కోళ్ల దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. స్థానికంగా ఉండే సంతకు సమీపంలోని ఓ హోటల్లో ఆదివారం నాడు ఈ దొంగతనం జరిగింది. విలువైన జాతి కోళ్లు ఎత్తుకెళ్లిపోయినట్టు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండే ఈ హోటల్లో నిత్యం చాలా మంది డ్రైవర్లు భోజనాలు చేస్తుంటారు.
దొంగకోళ్లు పట్టుకునే మొహాన్ని ఎప్పుడైనా చూశారా...? - శ్రీకాకుళం జిల్లా క్రైం న్యూస్
దొంగకోళ్లు పట్టుకునే మొహం చూడు... అని తిట్టడం మనం వింటూనే ఉంటాం. కానీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలిలో అలాంటి వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లో దొంగతనం చేసి నిఘా నేత్రాలకు చిక్కాడు. ఈ తరహ చోరీలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
దొంగకోళ్లు పట్టుకునే మొహాన్ని ఎప్పుడైనా చూశారా...?
అలా వచ్చిన వాళ్లా, లేక స్థానికులే ఈ చోరీలకు పాల్పడ్డుతున్నారా... అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే దొంగ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోవచ్చని సీసీ కెమెరా చూసిన పోలీసులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దొంగతనం చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం రేపింది.
ఇదీ చూడండి:కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్నిపరామర్శించిన సీఎం కేసీఆర్