తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2020, 5:05 PM IST

ETV Bharat / jagte-raho

వైద్యం వదిలేసి మాంత్రికుడిని నమ్మాడు.. అంతలోనే..

ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి వెళ్లాడు. ఐనా ఫలితం లేదని ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు. వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోకూడదు అనుకున్న ఆ మాంత్రికుడు పూజలు, హోమాల పేరుతో రూ.20 వేలకు ఎరవేశాడు. అంత సొమ్ము ఇచ్చుకోలేని ఆ రోగి ముందుగా రూ.10 వేలు ముట్టజెప్పాడు. రోజులు గడిచే కొద్ది ఆరోగ్యం మరింత క్షీణించింది తప్ప.. ఏ మాత్రం నయం కాలేదు. ఫలితంగా సోమవారం రాత్రి ఆ రోగి మృతి చెందాడు.

వైద్యం వదిలేసి మాంత్రికుడిని నమ్మాడు.. అంతలోనే..
వైద్యం వదిలేసి మాంత్రికుడిని నమ్మాడు.. అంతలోనే..

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నంది వనపర్తి గ్రామంలో అనుమాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వెలిగొండ గ్రామానికి చెందిన మహేశ్​​(21) రోజు వారి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా ఆరోగ్యం బాగాలేకపోయే సరికి చాలా ఆస్పత్రులు తిరిగాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఆరోగ్యం మెరుగుపడలేదు. బంధువుల సలహా మేరకు నంది వనపర్తిలో శ్రీహరి అనే ఓ మాంత్రికుడి దగ్గరకు ఈ నెల 24న వెళ్లాడు. ఒక్క రోజులో మంత్రాలు వేసి.. పటం గీసి ఆరోగ్యం బాగు చేస్తానని నమ్మించాడు ఆ మాంత్రికుడు. ఇందుకోసం రూ.20వేలు ఖర్చు అవుతుందన్నాడు. శ్రీహరి మాటలు నమ్మిన మహేశ్​ రూ.10 వేలు అడ్వాన్స్​గా ఇచ్చాడు.

మంత్రాలకు రోగం నయం కాకాపోవడంతో ఆరోగ్యం క్షీణించి సోమవారం రాత్రి నంది వనపర్తి గ్రామంలో మహేశ్​ మృతి చెందాడు. మంత్రాల పేరుతో మాయమాటలు చెప్పి తన భర్త ప్రాణాలు పోవడానికి కారణమైన శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని మహేశ్​ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాంత్రికుడి మాటలు విన్నందుకే తన భర్త మృతి చెందాడని ఆమె వాపోయింది.

ఇవీ చూడండి:1100ఏళ్ల నాటి బంగారు నాణేలు లభ్యం

ABOUT THE AUTHOR

...view details