తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 6:45 PM IST

ETV Bharat / jagte-raho

సొంత గ్రామానికి వచ్చి..బలవన్మరణం

నాలుగు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అంతలోనే విగతజీవిగా మారి కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చాడు. హైదరాబాద్​లో కెమెరామెన్​గా పనిచేస్తున్న సందీప్​రెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

A man suicide in mahaboobabad district
సొంత గ్రామానికి వచ్చి..బలవన్మరణం

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన సందీప్​రెడ్డి అనే కెమెరామెన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సాయిరెడ్డి, నర్సమ్మ దంపతులకు సందీప్, శ్రవణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

సందీప్ హైదరాబాద్​లో ఓ టీవీ ఛానెల్​లో పనిచేస్తుండగా, అతని తమ్ముడు ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి ఒకే గదిలో అన్నదమ్ములు నిద్రించిగా తెల్లవారేసరికి సందీప్ విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:భార్య కాపురానికి రావడం లేదని భర్త బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details