తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యువకుడి దారుణ హత్య.. ప్రేమేనా కారణం..? - యువకుడి హత్య వార్తలు పోతిరెడ్డిపల్లి

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో దారుణం జరిగింది. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అదే కాలనీలో సదరు యువకుడి మృతదేహం కనబడటం వల్ల గ్రామస్థులు నిర్ఘాంతపోయారు. ఇది ప్రేమ హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి ప్రియురాలి ఇంటి వద్ద రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గమనించారు. యువతీ కుటుంబీకులే ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

యువకుడి దారుణ హత్య.. ప్రేమేనా కారణం..?
యువకుడి దారుణ హత్య.. ప్రేమేనా కారణం..?

By

Published : Oct 20, 2020, 9:52 AM IST

కరీంనగర్​ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నరుకుడి ప్రణయ్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఇంట్లో ఉండగా, రాత్రి చరవాణికి ఫోన్‌ కాల్‌ వచ్చాక.. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లుగా కుటుంబీకులు తెలిపారు. మళ్లీ ప్రణయ్‌ తిరిగి ఇంటికి రాలేదని తెలిపారు. తెల్లవారుజామున అంబేడ్కర్‌ కమ్యూనిటీ భవనం వద్ద ప్రణయ్‌ మృతదేహం కనబడటం వల్ల గ్రామీణులు భయాందోళనకు గురయ్యారు.

ప్రణయ్‌ తలపై బలమైన గాయం మాత్రమే ఉండగా, అక్కడ ఎలాంటి రక్తపు మరకలు లేకపోవటం వల్ల ఎక్కడో చంపి.. మృతదేహన్ని తీసుకొచ్చి కాలనీ సమీపంలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రణయ్‌ తన ఇంటి సమీపంలోని ఓ యువతితో గత సంవత్సర కాలంగా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యవహరమే హత్యకు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐలు రాములు, సృజన్‌ రెడ్డి, ఎస్సై కిరణ్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాలనీ వాసులు, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రణయ్​ ప్రియురాలి ఇంటి వద్ద రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. యువతీ కుటుంబీకులే ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:తల ఒకచోట.. మొండెం మరోచోట.. అతికిరాతకంగా మహిళ హత్య

ABOUT THE AUTHOR

...view details