తెలంగాణ

telangana

ఆక్సిజన్‌ అందక కొవిడ్ వార్డులో వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్​-19 వార్డులో ఆక్సిజన్ అందక ఓ వ్యక్తి మృతి చెందాడు. తన కొడుకు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

By

Published : Jul 19, 2020, 6:18 AM IST

Published : Jul 19, 2020, 6:18 AM IST

Updated : Jul 19, 2020, 6:47 AM IST

a man died in covid-19 ward at nalgonda district hospital
నల్గొండ జిల్లా ఆస్పత్రి కొవిడ్​ వార్డులో వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సల్కునూర్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో శనివారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు అతన్ని కొవిడ్-19 వార్డులో చేర్చారు. ఆక్సిజన్‌ అందక సాయంత్రానికి అతడు చనిపోయాడు. కరోనా శాంపిల్స్ సేకరించారు... కానీ ఇప్పటి వరకు ఫలితాలు రాలేదని వైద్యులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే తన కొడుకు మృతి చెందాడని అతని తల్లి ఆరోపిస్తున్నారు.

Last Updated : Jul 19, 2020, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details