జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్యచేశాడు. గ్రామానికి చెందిన అరికెల లక్ష్మిని ఆమె భర్త సత్తయ్య గొంతుకోసి చంపాడు.
కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి హత్య - తెలంగాణ నేర వార్తలు
కుటుంబ కలహాలతో భార్యను కిరాతకంగా హత్యచేసిన ఘటన రాయికల్ మండలంలో జరిగింది. అరికెల లక్ష్మీని ఆమె భర్త గొంతు కోసి హత్యచేశాడు.
![కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి హత్య కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి హత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8445368-thumbnail-3x2-murder-rk.jpg)
కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి హత్య
గత కొంతకాలంగా భార్యాభర్తలు గొడపడుతున్నారు. అయిదు నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మరళా గొడపడి కిరాతకంగా అంతమొందించాడు. హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:అశ్లీల వెబ్సైట్తో విటులకు వల...3వేల మందికి టోపీ..!