తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి హత్య - తెలంగాణ నేర వార్తలు

కుటుంబ కలహాలతో భార్యను కిరాతకంగా హత్యచేసిన ఘటన రాయికల్​ మండలంలో జరిగింది. అరికెల లక్ష్మీని ఆమె భర్త గొంతు కోసి హత్యచేశాడు.

కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి హత్య
కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి హత్య

By

Published : Aug 17, 2020, 1:47 AM IST

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండల కేంద్రంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్యచేశాడు. గ్రామానికి చెందిన అరికెల లక్ష్మిని ఆమె భర్త సత్తయ్య గొంతుకోసి చంపాడు.

గత కొంతకాలంగా భార్యాభర్తలు గొడపడుతున్నారు. అయిదు నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మరళా గొడపడి కిరాతకంగా అంతమొందించాడు. హత్య చేసిన అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:అశ్లీల వెబ్​సైట్​తో విటులకు వల...3వేల మందికి టోపీ..!

ABOUT THE AUTHOR

...view details