ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణం కొవ్వూరుగూడెంలో విశ్రాంత ఉపాధ్యాయుడు కల్వకుర్తి నాగేశ్వరరావు గత ఐదేళ్లుగా జపాను షాపర్డుకు చెందిన ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి రాయ్ అనే పేరు పెట్టారు. శుక్రవారం రాత్రి.. నాగేశ్వరరావు ఇంటి ఆవరణలోకి ఓ త్రాచుపాము ప్రవేశించింది. గుర్తించిన శునకం.. దానితో పోరాటం చేసి పామును చంపేసింది. ఈ క్రమంలో పాము కాట్లతో శునకం కూడా కొద్దిసేపటికే మృతిచెందింది.
లైవ్ వీడియో: పామును చంపి కుటుంబాన్ని కాపాడిన శునకం - chinthlapudi news
విశ్వాసానికి మారుపేరు కుక్క. కొంచెం ఆదరిస్తే చాలు కదలకుండా మన ఇంటిని కాపలాకాస్తుంది. ఇంట్లోకి వచ్చిన పామును చంపి.. కుటుంబ సభ్యులను కాపాడింది ఓ శునకం. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణం ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలోనే శునకం కూడా ప్రాణం కోల్పోయింది.
ఆదరించిన కుటుంబం కోసం ప్రాణాలొడ్డిన శునకం
ప్రేమగా పెంచుకున్న శునకం చనిపోవడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Last Updated : Nov 14, 2020, 5:39 PM IST