తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పండుగ మిగిల్చిన విషాదం.. గాలిపటమే యమపాశం! - Rangareddy district district crime news

పండగ పూట గాలిపటం ఎగరవేస్తూ ఆ బాలుడు అప్పటివరకు ఆనందంగా ఆడుకున్నాడు. అదే పతంగితో పొటో కూడా దిగాడు. కాని పాపం అతడికి ఏం తెలుసు.. అదే గాలిపటం తన ప్రాణాన్ని బలితీసుకుంటుందని. నిండు నూరేళ్ల తన జీవితాన్ని చిన్నతనంలోనే చిదిమేస్తుందని..!

A boy was killed while flying a kite in Rangareddy district district
గాలిపటమే యమపాశం అయింది

By

Published : Jan 15, 2021, 7:44 PM IST

పండగపూట పతంగి ఆట సంబరం ఓ బాలుడి నిండు ప్రాణాల్ని బలిగొంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయిలు, వెంకటమ్మ కుమారుడు పదమూడేళ్ల రాకేష్ గాలిపటం ఎగురవేస్తుండగా.. ఆ గాలిపటం విద్యుత్‌ వైర్లకు చిక్కుకుంది.

వైర్లలో చిక్కిన ఆ పతంగిని తీయడం కోసం ఇనుప రాడ్​తో లాగడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా విద్యుత్​ఘాతం తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కాపాడడానికి వెళ్లిన అక్క సోనికి కూడా గాయాలయ్యాయి. ఆమెని హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్​కి తరలించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:కొలిక్కిరాని చర్చలు- 19న మరోసారి భేటీ!

ABOUT THE AUTHOR

...view details