తెలంగాణ

telangana

By

Published : Jan 15, 2021, 7:03 PM IST

ETV Bharat / jagte-raho

విషాదం: పతంగి ఎగురవేస్తూ బాలుడు మృతి!

సరదాగా ఎగురవేసే గాలిపటం ఓ బాలుడి ప్రాణాలు బలిగొంది. పండుగ పూట చిన్నారి సంతోషంగా పతంగి ఎగురవేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలించే లోపే అనంతలోకాలకు చేరాడు.

a-boy-died-while-flying-kite-at-shapur-nagar-in-medchal-malkajgiri-district
విషాదం: పతంగి ఎగురవేస్తూ బాలుడు మృతి!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలోని షాపూర్​నగర్​లో విషాదం చోటు చేసుకుంది. పతంగి ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతి చెందాడు. కరెంట్​ షాక్​కు గురైన చిన్నారిని చూసి స్నేహితులు అరవడంతో బాలుడి తండ్రి వెంటనే వచ్చారు.

చనిత్​ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:చైనా రుణయాప్​లో కేసులో దర్యాప్తు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details