తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జీహెచ్​ఎంసీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రూ.7 కోట్లకు టోకరా - telangana latest news

జీహెచ్‌ఎంసీతో పాటు ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సుమారు 1500 మంది నుంచి దాదాపు రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

7 crores cheating in the name of ghmc jobs in hyderabad
జీహెచ్​ఎంసీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రూ.7 కోట్లకు టోకరా

By

Published : Dec 20, 2020, 7:51 AM IST

జీహెచ్ఎంసీతో పాటు పలు ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ఎక్సోరా సంస్థలో గంగాధర్ ఆపరేషనల్ మేనేజర్​గా, మహేందర్ హెచ్ఆర్​గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ జీహెచ్ఎంసీ, ఇతర ప్రైవేటు సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రచారం ప్రారంభించారు. దానికి అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. స్వీపర్​ ఉద్యోగానికి రూ.50,000, సూపర్​వైజర్​ ఉద్యోగానికి రూ.లక్ష చొప్పున సుమారు 1500 మంది వద్ద దాదాపు రూ.7 కోట్ల వరకు వసూలు చేశారు. సంస్థ తరపున ఐడీ కార్డులూ ఇచ్చారు.

3 నెలలు బాధితులతో స్వీపింగ్ పనులు చేయించారు. నెలకు రూ.14 వేల జీతం అంటూ నమ్మబలికి.. తీరా జీతం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వీరి అసలు రంగు బయటపడింది. ఈ క్రమంలోనే బాధితులు గంగాధర్​, మహేందర్​లపై ఎక్సోరా సంస్థలో ఫిర్యాదు చేశారు. ఐసీఎస్ సంస్థ వారిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేవైఎం రాష్ట్ర పబ్లిసిటీ కన్వీనర్ పొన్న వెంకట రమణ సైతం ఆధారాలతో సహా శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరోవైపు డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాకపోవడంతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: ఉద్యోగాల పేరుతో మోసం.. 450 మందికి టోకరా

ABOUT THE AUTHOR

...view details