తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2020, 9:34 PM IST

ETV Bharat / jagte-raho

పేలుడు సామగ్రి అమర్చుతున్న ఐదుగురు మావోయిస్టు మిలిటెంట్​ల అరెస్ట్

మావోయిస్టులకు సహకరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీష్​ హెచ్చరించారు. పోలీసులను హతమార్చేందుకు పేలుడు సామగ్రిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమర్చుతున్న ఐదుగురు మావోయిస్టు మిలిటెంట్​లను మణుగూరు పోలీసులు పట్టుకున్నారు.

5 Maoist militants arrested at manuguru in bhadradri kothagudem district
పేలుడు సామగ్రి అమర్చుతున్న ఐదుగురు మావోయిస్టు మిలిటెంట్​ల అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు గత రెండేళ్లుగా మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు. భద్రాద్రి, తూర్పుగోదావరి జిల్లాల మావోయిస్టు కమిటీ కార్యదర్శి ఆజాద్​, మణుగూరు ఏరియా మావోయిస్టు కమిటీ నేతల సూచన మేరకు కరకగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేలుడు సామగ్రిని అమర్చుతున్న ఈ ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు.

వీరి నుంచి పది జెలిటిన్​ స్టిక్స్​, 40 మీటర్ల వైరు, 3 డిటోనేటర్లు, రెండు టిఫిన్​ బాక్సులు, ఆరు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు ఏఎస్పీ శబరీష్​ ప్రకటించారు. మావోయిస్టు పార్టీ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం అమాయక గిరిజన ప్రజల్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ రోజురోజుకూ క్షీణిస్తూ ఉనికిని కోల్పోతున్న నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

ఇదీ చూడండి:ఊహించని ప్రమాదం... తప్పిన అపాయం

ABOUT THE AUTHOR

...view details