తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: మినీబస్​ ఢీకొని 4 గేదెలు మృతి - ములుగు జిల్లాలో గేదెలు మృతి వార్తలు

ములుగు జిల్లా గుమ్మడిదొడ్డి సమీపంలో ఓ మినీ బస్​ గేదెలను ఢీకొట్టింది. ఘటనలో 4 గేదెలు మృతి చెందాయి.

4 buffaloes killed in minibus collision
విషాదం: మినీబస్​ ఢీకొని 4 గేదెలు మృతి

By

Published : Jul 11, 2020, 11:17 AM IST

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ బస్​ రోడ్డుపై ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఘటనలో 4 గేదెలు మృతి చెందాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మినీ బస్​ కలకత్తా నుంచి కార్మికులను తీసుకుని హైదరాబాద్​కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మరోవైపు మృతి చెందిన గేదెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: ప్రోటోకాల్ పాటించక ఘర్షణ.. గాయపడ్డ పశుసంవర్ధక అధికారి

ABOUT THE AUTHOR

...view details